- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు మహబూబాబాద్కు సీఎం రేవంత్రెడ్డి.. ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్కు హాజరు
దిశ,వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్కు హాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డి.. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మానుకోటలో రేవంత్రెడ్డి పర్యటించనునుండటం గమనార్హం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి సొంత నియోజకవర్గం కూడా. బుధవారం మహబూబాబాద్లో పర్యటించిన వేం నరేందర్రెడ్డి సభా ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ఇల్లందు, పినపాక, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు శ్రేణులను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఆనుకున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మంట్ల నుంచి జన సమీకరణ చేయనున్నారు.
ముఖ్య నేతల రాక... ఊపందుకున్న ప్రచారం..
నామినేషన్లు ప్రారంభం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. మానుకోట కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ ముఖ్య నేతలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రచారంలో నిమగ్నం కానున్నారు. శుక్రవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్, మానుకోట నియోజకవర్గాల్లో ప్రచారం జోరు పెరగనుంది.