పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్

by Disha Web Desk 23 |
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్
X

దిశ, హనుమకొండ టౌన్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా పరకాల లో మారిన పోలింగ్ కేంద్రాలైన రాజిపేట అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన 47, ఉర్దూ మీడియం పాఠశాలలోని 48, 50 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల తేదీన ఓటర్లు ఇబ్బందులు పడకుండా తాగునీరు, విద్యుత్, ర్యాంపు, తదితర సదుపాయాలను ఆర్డివో నారాయణ, తహసీల్దార్ భాస్కర్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్డివో ఛాంబర్లో ఆర్డివో నారాయణ, తహసీల్దార్ భాస్కర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఈవిఎం లను భద్రపరిచేందుకు సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారనే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల పురపాలక కమిషనర్ నర్సింగం, ఎంపీడీవో ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed