భారీ వర్షాలకి కూలిన గుడిసె

by Aamani |
భారీ వర్షాలకి కూలిన గుడిసె
X

దిశ, కన్నాయిగూడెం : గత వారం పది రోజులుగా ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి కన్నాయిగూడెం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతుంది. కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొల్లె సమ్మయ్య పూరి గుడిసె భారీ వర్షాలకి గురువారం రోజున కూలిపోవడం జరిగింది.వృద్యాప్యంలో ఉన్న తన గుడిసె కూలిపోవడంతో ఉండటానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మండల,జిల్లా అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందించాలని పత్రికా ప్రకటనలో అధికారులను వేడుకున్నారు.



Next Story