మాజీ మంత్రి కేటీఆర్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
మాజీ మంత్రి కేటీఆర్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సెక్రెటేరియట్ భవనం ముందు ఆవిష్కరించబోతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. మీరు అసలు అధికారంలోకి వస్తే కదా ఏదైనా చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు వీహెచ్. విదేశాల్లో ఉన్నత చదువుకున్నప్పటికీ కనీస జ్ఞానం లేదంటూ కేటీఆర్ మీద మండిపడ్డారు. మీ తండ్రి కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిందే రాజీవ్ గాంధీ, అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం సెక్రెటేరియట్ ముందు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలిపోయిందని, ఇక బీఆర్ఎస్ తెలంగాణలో ఇక ఉండదు, అధికారంలోకి రావడం కల అంటూ మాట్లాడారు వీహెచ్.

Next Story

Most Viewed