Union Budget 2025: పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు

by Ramesh N |
Union Budget 2025: పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర వార్షిక 2025-26 (Union Budget 2025) బడ్జెట్‌ను శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (NirmalaSitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పట్టణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం (UPI) యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు తీసుకురాబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. పట్టణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో కార్డు చెల్లింపుల కంటే యూపీఐ చెల్లింపులు వేగంగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రకటించారు.


Next Story