- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వినాయక చవితి వేడుకల్లో అపశృతి.. మండపాన్ని అలంకరిస్తుండగా విద్యుత్ షాక్
దిశ, వేములవాడ: వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మండపాన్ని అలంకరిస్తున్న సమయంలో విద్యుత్ షాక్తో ఇద్దరు వలస కూలీలు గాయపడ్డారు. ఈ సంఘటన వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన కోనాయపల్లిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, మండప నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ దాస్, అమిత్ గౌర్ అనే ఇద్దరు వలస కూలీలు శనివారం ఉదయం స్థానికంగా ఉన్న వినాయక మండపాన్ని డెకరేషన్ చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో వారు మండపాన్ని డెకరేషన్ చేస్తున్న సమయంలో సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వివరాలు సేకరిస్తున్నారు.