TG Govt.: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ జమపై ప్రభుత్వం కీలక ప్రకటన!

by Shiva |
TG Govt.: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ జమపై ప్రభుత్వం కీలక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను అందజేస్తోంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 27న జీవో కూడా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89.99 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. అయితే, వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ సొమ్మును జమ చేయలేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కాగా, సబ్సిడీ డబ్బు జమ అయ్యేందుకు మరో నాలుగు నుంచి ఐదు రోజల సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed