రేవంత్, బాబుల భేటీలో పాల్గొనే మంత్రులు, అధికారులు వీరే..!

by Satheesh |
రేవంత్, బాబుల భేటీలో పాల్గొనే మంత్రులు, అధికారులు వీరే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. గత పదేండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ముఖాముఖీ సమావేశం కానున్నారు. విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా జరగనున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రుల హోదాలో ఫస్ట్ టైమ్ మీట్ కాబోతోన్న నేపథ్యంలో ఈ భేటీపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఏపీ, తెలంగాణ నుండి ఈ భేటీలో పాల్గొననున్న వారు:

తెలంగాణ నుండి పాల్గొనేవారు:

సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క

మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్

అధికారులు

సీఎస్ శాంతి కుమారి

మరో ఇద్దరు అధికారులు

ఆంధ్ర ప్రదేశ్ నుండి పాల్గొనేవారు:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మంత్రులు, కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్ధన్

అధికారులు

సీఎస్ నీరబ్ కుమార్

ఐఏఎస్ కార్తికేయ మిశ్రా

ఐఏఎస్ రవిచంద్ర

Advertisement

Next Story