యువతలో పబ్ కల్చర్ పోయి భక్తి పెరిగింది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
యువతలో పబ్ కల్చర్ పోయి భక్తి పెరిగింది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : యువతలో పబ్ కల్చర్ పోయి భక్తి పెరిగిందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇంచార్జ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో ప్రతి ఒక్కరిలో భక్తితో పాటు దేశభక్తి కూడా బాగా జరిగిందని అన్నారు. అలాగే మన సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మన భారతీయులంతా ఏకతాటిపై కలిసి ఉండాలన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతోమంది ప్రజలు సంతోషంగా హనుమంతుని జయంతి ఉత్సవాలు జరుపుకుంటే మరోవైపు హనుమాన్ దేవాలయాలను కూల్చే మూర్ఖులు కూడా మనదేశంలోనే ఉన్నారన్నారు. యువతతో పబ్బు కల్చర్ పూర్తిగా పోయి భక్తి, దేశభక్తి పై మక్కువ చూపుతున్నారన్నారు. ముఖ్యంగా దేశంలో ధర్మం గెలవాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రాజ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు నందకిషోర్ నాయకులు దేవేందర్, మహిపాల్ రెడ్డి, శరత్,విరేష్,రాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed

    null