- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
2వ నెంబర్కు ఓటు వేస్తే 2 లక్షల మెజార్టీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వర్రెడ్డి
దిశ, బడంగ్పేట్: ప్రధాని మోడీకి ఓటు వేయాలని బీజేపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నామని, అదే రాహుల్బాబా పేరు చెబితే ఓట్లు పోతాయని కాంగ్రెస్పార్టీ భయపడుతుందని చేవెళ్ల పార్లమెంట్బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలలవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతోందని, ప్రస్తుతం కాంగ్రెస్ఆరు గ్యారంటీలను కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంత సేపు ఇతర పార్టీల మీద బురదజల్లడానికి సరిపోతుందని, ఫేక్ వీడియోలు సృష్టించి ఓట్లు కొల్లగొడుతామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం దాపరించిందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వందలాది మంది బీజేపీ శ్రేణులతో కలిసి భారీ బైక్ర్యాలీ నిర్వహించారు.
గుర్రంగూడ నుంచి ప్రారంభమైన బైక్ర్యాలీ శ్రీ శ్రీ హోమ్స్ మీదుగా అల్మాస్గూడ, బడంగ్పేట్, సికెఆర్.. కేటీఆర్ఫంక్షన్ హాల్, బాలాపూర్వేణు గోపాల్స్వామి దేవాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే ఒక్క బడంగ్ పేట్కార్పొరేషన్ పరిధిలోనే 70 శాతం ఓట్లు బీజేపీకి కచ్చితంగా పడతాయన్నారు. గతంలో కాంగ్రెస్కు, బీఆర్ఎస్పార్టీలకు ఓట్లు వేసిన వారు సైతం ఈ సారి ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారన్నారు. యావత్ భారతదేశమంతటా కూడా ఈ సారీ మోడీ ప్రభుత్వానికి మా ఓటు అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారన్నారు.
గత ఎమ్మెల్యే ఎన్నికల ఓట్ల శాతం తో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో పదింతలు రెట్టింపు పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ఆరు గ్యారంటీలే గాడిద గుడ్లు సరిపో లేదన్నట్లు మరి కొత్తగా మరో 20 గాడిద గుడ్లు చూపెడుతున్నారన్నారు. మరోసారి మోడీకి ఓటు వేస్తే దేశం అభివృద్ధి బాటలో పయనించడంతో పాటు మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈవిఎం మిషన్లో 2వ నెంబర్కు ఓటు వేస్తే 2లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్రెడ్డి, బడంగ్ పేట్కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు రామకృష్ణారెడ్డి, శురకర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.