పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |
పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మహేశ్వరం: పురాతన దేవాలయాల అభివృద్ధికి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని జన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపేట వేశారన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలోని 8 పురాతన దేవాలయాలకు 8 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. దేవాలయాల్లో దూప, దీప, నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, రెడ్డిగల్ల సుమన్, దేవాలయ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed