చేవెళ్ల ప్రజలే నాకు బలం బలగం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
చేవెళ్ల ప్రజలే నాకు బలం బలగం : రంజిత్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : చేవెళ్ల ప్రజలే నాకు బలం బలగం అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి లో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …ఎవరైనా తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. ఆధారాలు తీసుకుని వస్తే ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, జల్లపల్లి నరేందర్, సులోచన, సంజయ్ యాదవ్, విజయ,గౌతమి, లలిత్, పవిత్ర సాగర్, ధనుంజయ్, మల్లేష్, లక్ష్మయ్య, జగన్నాథం, అక్రమ్, మిట్టు, నజీర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed