- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

దిశ, బడంగ్ పేట్ :రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ..పతంగి రాజ్ భూపాల్ గౌడ్ తో సోమవారం నాదర్ గుల్ గ్రామం శక్తి కేంద్ర ఇంచార్జి, బిజెపి సీనియర్ నాయకుడు నిమ్మల రవికాంత్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ముందుగా జిల్లా నూతన అధ్యక్షునికి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇదే మంచి అవకావమని, రంగారెడ్డి జిల్లాలో భారతీయజనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని అన్నారు.
ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రతి కార్యకర్త సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు ఏనుగు రామ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ పెత్తుల పుల్లారెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు రామిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు మర్రి అంజి రెడ్డి, గూడూరు చంద్రశేఖర్ రెడ్డి , అందెల ఐలయ్య యాదవ్, తోట అరవింద్ రెడ్డి, యాతం వెంకటేష్ యాదవ్, మంత్రి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మంత్రి కృష్ణ, వంక ప్రభాకర్, సతీష్ నంద, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.