ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.. నిద్ర మత్తులో అధికారులు

by Sumithra |
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.. నిద్ర మత్తులో అధికారులు
X

దిశ, నందిగామ : నందిగామ మండలం కేంద్రం నుండి నర్సప్పగూడ చేగూర్ వెళ్లే ఈ రహదారిలో బుధవారం లారీ బోల్తా పడింది. ఈ రోడ్డులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రహదారికి నిధులు ఉన్న నిర్మాణాలు చేయకపోవడం గమనార్హం.

నందిగామ మండల కేంద్రం నుండి చాలా వాహనాలు ఇరుకైన రోడ్డులో వెళ్తుంటాయి. ఎడమ నుండి ఒక వాహనం కుడి నుండి ఒక వాహనం వస్తే పక్కకు జరగడానికి జాగనే లేదు. ఇరుకైన రోడ్లో ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed