- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో బర్డ్ప్లూ కేసులు నమోదు కాలేదు : పశుసంవర్ధక శాఖ

దిశ, తెలంగాణ బ్యూర్ : రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫారాల్లో తనిఖీలు చేపట్టారు. బర్డ్ప్లూ అనుమానంతో చనిపోయిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్సేకరిస్తున్నారు. ఈమధ్యకాలంలో ఎండలు విపరీతంగా పెరగడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించి నమూనాలు ల్యాబ్కు పంపడంతో గురువారం నాటికి స్పష్టత వస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇన్ ప్లూ యేంజా లక్షణాలు కనిపిస్తే వాటిని వేరు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణలో నిజామాబాద్,కామారెడ్డి, నిర్మల్, ఖమ్మం జిల్లా కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల ఫారాలకు ముమ్మరంగా తనిఖీలు చేసి వ్యాధి వ్యాపించకుండా అవగాహన చేపడుతున్నారు. మహారాష్ట్ర, చత్తీష్గడ్, ఆంద్రప్రదేశ్ లో తీవ్రంగా ఉన్నట్లు గుర్తించి సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇటీవల హెచ్చరించిన విధంగా కోళ్లు చనిపోయి ఉంటే వాటిని అక్కడి నుంచి తరలించి సర్వైలైన్ జోన్లోగా ప్రకటించాలని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా రాష్ర్ట సరిహద్దులో 24 చెక్పోస్టులు ఏర్పాటు చేసి, కోళ్లు, గ్రుడ్లు రాకుండా నిరోధించే చర్యలు చేపడుతున్నారు. చికెన్,గుడ్లు తినేందుకు భయపడాల్సిన పనిలేదని, అదిక ఉష్ణోగ్రత లో ఈవైరస్జీవించిందని వైద్యులు వెల్లడించారు. చికెన్, ఎగ్100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తామని, అందులో ఎలాంటి వైరస్ప్రభావం ఉందని చెబుతున్నారు. ఈవైరస్వ్యాప్తికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. మనుషులపై ఈవైరస్పెద్దగా ప్రభావం చూపదన్నారు.
చికెన్ కేజీ రూ.100 మాత్రమే
బర్డ్ప్లూ భయానికి చికెన్ధరలు గణనీయంగా పడిపోయాయి. మొన్నటివరకు కిలో రూ. 290 ఉండగా, కోడి మాంసం ధర అమాంతం కిలో రూ. 100లకు పడిపోయింది. వైరస్తో జనం చికెన్తినేందుకు దుకాణాల వైపు మళ్లీ చూడటం లేదు. 60 శాతం వరకు చికెన్అమ్మకాలుపడిపోయాయి. గుడ్ల ధరలు తగ్గి 100 గుడ్లను రూ. 445 కే అమ్మకాలు చేస్తున్నారు.
బర్డ్ప్లూ కేసులు నమోదు కాలేదు : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గోపీ
తెలంగాణలో బర్డ్ప్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపీ తెలిపారు. ఇతర కారణాలతో కోళ్లు మృతి చెందినట్లు, చికెన్తినడంతో ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పారు. సోషల్మీడియాలో వస్తున్న ప్రచారం నమ్మవద్దని సూచించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్స్కు పంపించామని, ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందన్నారు. బర్డ్ప్లూ పై కోళ్ల పెంపకం రైతులతో సమావేశాలుఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్కూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోళ్లనుంచి మనుషులకు వైరస్సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. కోళ్ల ఫారాలలో వైరస్సోకిన కోళ్లకు దగ్గరగా పనిచేసే వారికి స్వల్పంగా దగ్గు , జలుబు వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.