- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- భక్తి
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ
by Sridhar Babu |
X
దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండల కేంద్రం, ఉప్లూర్, నాగాపుర్, ఆర్ఆర్ నగర్ గ్రామాలలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ...తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువు దోపిడీ చేశారని, ఒకే కాంటాక్టర్ ను పెట్టుకొని కోట్ల రూపాయల దోపిడీ చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story