- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మూడో రోజు 7 నామినేషన్లు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శనివారం ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాగి అనిల్ (నిజామాబాద్), విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూక్యా నందు( రాయికల్ జగిత్యాల), బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా నామినేషన్పత్రం అందజేసిన దేవతి శ్రీనివాస్ (వేల్పూర్) లు
శనివారం సైతం రెండవ సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా కొత్తగా స్వతంత్ర అభ్యర్థులుగా ఆరే రవీందర్(మల్లాపూర్, జగిత్యాల్), గంట చరితా రావు(మోర్తాడ్, నిజామాబాద్), సయ్యద్ అస్గర్ (బోధన్), మిర్యాల్కర్ జయప్రకాష్ (నిజామాబాద్) నామినేషన్లు వేశారని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో గంట చరిత రావు అనే యువతి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.