బాసర గోదావరిలో ధర్మారం మహిళ గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం

by Naresh |
బాసర గోదావరిలో ధర్మారం మహిళ గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం
X

దిశప్రతినిధి, నిజామాబాద్: గోదావరి నదిలో పవిత్ర స్నానానికి వెళ్లిన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన మహిళ జయగంగ శుక్రవారం ప్రమాదవశాత్తు గల్లంతైంది.

కుటుంబ సభ్యులతో కలిసి ఆవిడ బాసరకు శుక్రవారం ఉదయం ధర్మారం నుంచి బయలుదేరి వెళ్లారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పవిత్ర స్నానం చేసేందుకు నీళ్లలోకి దిగిన జయగంగ ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయింది. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, ప్రవాహ ఉధృతి కూడా ఎక్కువగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుపోయింది. గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూ టీం.

Advertisement

Next Story

Most Viewed