పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

by Sridhar Babu |
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజ్, సీఐ అంజయ్య ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 17 మందిని గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.74,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో గేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలకై అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story