మట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

by Sridhar Babu |
మట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో మట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నగరంలోని 6 టౌన్ లిమిట్స్ ఆటోనగర్ నయా బ్రిడ్జ్ వద్ద రజాక్ హోటల్లో మట్కా నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అప్పటికే సమాచారం లీక్ కావడంతో ఇద్దరు నిర్వాహకులు తప్పించుకుపోయారు. అక్కడ మట్కా ప్లేయర్ సద్దాంను అదుపులోకి తీసుకొని రూ .9,550, సెల్ ను ఫోన్ టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు. సద్దాంను ఆరవ టౌన్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story