ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య

by Sridhar Babu |
ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య
X

దిశ, లింగంపేట్ : మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన దాసరి సాయిలు (55) అనే వ్యక్తి మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన సాయిలు 30 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం లింగంపల్లికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా మంగళవారం ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మృతుని సోదరుడు దాసరి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి సర్కార్ దావఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య భారతి తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story