- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
సహకార సంఘాల ద్వారా రైతులకు వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణాన్ని అనుసరిస్తూ సరిపడా మోతాదులో ఎరువులు అందించాలన్నారు. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎరువుల క్రయవిక్రయాల వివరాలను ఈ-పాస్ మెషిన్ ద్వారా నమోదు చేసేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తేవాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల వల్ల రైతులు మోసపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ రంజిత్ రెడ్డి, ఆయా మండలాల ఏ.ఓలు పాల్గొన్నారు.