ఈనెల 4న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం

by Sridhar Babu |
ఈనెల 4న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఈనెల 4న నవ్యభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు హరిదా రచ యితల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ రోడ్డు లోని మాణిక్ బండార్ లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం, సరస్వతీరాజ్-హరిదా ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి ముఖ్యఅతిథిగా, ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ అమృతలత, తెలంగాణ చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్, నవ్య భారతి విద్యాసంస్థల చైర్మన్ క్యాతం సంతోష్ కుమార్ గౌరవ అతిథులుగా హాజరవుతారని, రాష్ట్రం నలుమూలల నుంచి కవులు, కవయిత్రులు కవిత గానం చేస్తారని, జిల్లాలోని సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed