లింగంపల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాల మంజూరు

by Disha Web Desk 15 |
లింగంపల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాల మంజూరు
X

దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలను గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. గ్రామంలోని ఈ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాలగా ఎంపికైనట్టు తెలిపారు. ఎంపికైన పాఠశాలల్లో గల మౌలిక వసతులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు పనులు చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. పాఠశాలలకు మంజూరైన పనులను జూన్ 10వ తారీకులోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ పనులను గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నరేందర్, మండల విద్యాశాఖ అధికారి రామస్వామి తోపాటు డీఈ, ఏఈలు ఉన్నారు.

Next Story

Most Viewed