శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల

by Aamani |
శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరిలోకి నీటి విడుదల
X

దిశ, బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు గుప్తా, ఈఈ చక్రపాణి ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుపై పూజలు నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ 8గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదిలమన్నారు.

గంట గంటకు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరి లోకి తెలిపారు. అదేవిధంగా గోదావరిలోకి ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరి లోకి 6000, క్యూసెక్కులు,కాకతీకాలు ఒక 2000 క్యూసెక్కులు, వరద కాలువకు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091. 00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా 1088.70 అడుగులు 72.230 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed