నిజామాబాద్ జీజీహెచ్ నుంచి రోగి అదృశ్యం..

by Sumithra |
నిజామాబాద్ జీజీహెచ్ నుంచి రోగి అదృశ్యం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎలుపుగొండ గ్రామానికి చెందిన మంగళి సంగయ్య (50) నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయ్యాడు. మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బాత్రూంకి వెళ్ళొస్తానని అతని భార్యకు చెప్పి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని బాధితులు చెబుతున్నారు.

సంగయ్య కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనికి కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్ నుండి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ షర్ట్, లుంగీ కట్టుకుని ఉన్నాడు. సంగయ్య ఆచూకీ తెలిస్తే 8712659837 కు సమాచారం అందించాలని వన్ టౌన్ ఎస్ ఐ డి.విజయబాబు తెలిపారు.

Next Story

Most Viewed