హాస్టల్లో వడ్డించిన అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం..

by Sumithra |
హాస్టల్లో వడ్డించిన అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం..
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన తెలంగాణ అమరవీరుల యాదిలో ఏర్పాటు చేసిన డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల హాస్టల్లో శుక్రవారం పెట్టిన అల్పాహారంలో బల్లి ప్రత్యక్షమైంది. తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన తెలంగాణ అమరవీరుల యాదిలో ఏర్పాటు చేసిన డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల హాస్టల్లో శుక్రవారం పెట్టిన అల్పాహారంలో బల్లి ప్రత్యక్షమైంది.

దీంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయం బయటకు రాకుండా ఎవరికీ చెప్పొద్దు అంటూ యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను బెదిరించిన ఘటన వెలుగు చూసింది. విషయం బయటికి వస్తే యూనివర్సిటీ నుండి పంపించేస్తామని అధికారులు విద్యార్థుల పై హుకుం జారీ చేశారు. అయితే ఈ ఘటనలో సంబంధిత వంట మనిషిని అధికారులు సస్పెండ్ చేసి, సరఫరా చేసే కాంట్రాక్టర్ ను సైతం హెచ్చరించినట్లు సమాచారం.

Next Story