ఓటర్లకు పంపకాలు షురూ.. మందు, కూల్ డ్రింక్స్, ఓటుకు వెయ్యి

by Mahesh |
ఓటర్లకు పంపకాలు షురూ.. మందు, కూల్ డ్రింక్స్, ఓటుకు వెయ్యి
X

దిశ, భిక్కనూరు: ప్రలోభాల పర్వానికి ప్రధాన పార్టీలు తెరలేపాయి.ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు, వారికి క్వార్టర్ మందు బాటిళ్లను పంపిణీ చేయడమే కాకుండా, ఓటుకు 1000 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ల జాబితాను వెంటబెట్టుకొని వెళ్తున్న ఆయా పార్టీల నేతలు ఇంటింటికి తిరుగుతూ పంపకాలు సాగిస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి, ప్రముఖులు పోటీ చేస్తుండడంతో, వారిరువురి గెలుపు కోసం ఆయా పార్టీల నేతలు ఎవరికి వారుగా, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో తిరుగుతూ.. మందు, నగదే కాకుండా, కూల్ డ్రింకులు, మటన్ చికెన్‌ పొట్లాలు కట్టి ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఇచ్చి వస్తున్నారు.

మీ ఓటు ఫలానా గుర్తుకు ఓటు వేయాలని నొక్కి మరీ చెప్పి వస్తున్నారు. ప్రచార పర్వం ముగియడంతో, పంపకాల పర్వానికి శ్రీకారం చుట్టారు. పోలింగ్ జరిగేందుకు 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, నగదు, మందు, కూల్ డ్రింకులు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. అర్ధరాత్రి, వేకువ జామున అని కాకుండా, పట్టపగలు, సాయంత్రం, రాత్రి వరకు కూడా పంపకాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రలోభాల పర్వం ఊపందుకుంది.

Next Story

Most Viewed