సన్నాసులను చెప్పులతో తరిమి కొట్టండి

by Sridhar Babu |
సన్నాసులను చెప్పులతో తరిమి కొట్టండి
X

దిశ, ఆర్మూర్ : కారు గుర్తుకు ఓటు వేయకపోతే పెన్షన్లు తీసేస్తామంటూ నియోజకవర్గంలోని మహిళలందరినీ భయాందోళనకు గురి చేస్తున్న సన్నాసులను మహిళలందరూ ఏకమై చెప్పులతో తరిమి కొట్టండి అని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం మోతె, భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామాలలో అన్నపూర్ణమ్మ మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ... ఆడపడుచుగా నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆశీర్వదించి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గంలోని యువతను గంజాయికి బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా అని విమర్శించారు. అనంతరం ఎర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు, నాగేంద్ర నగర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు, అలాగే భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు, సంతోష్ నగర్ తండాకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, యువకులు, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన వార్డ్ మెంబెర్ అశోక్, నవయువ సేవా సమితి సభ్యులు, కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు అన్నపూర్ణమ్మ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి, ములిగే మహిపాల్, డోళ్ళ రమేష్, గంగారెడ్డి, నర్సారెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed