రాష్ట్రంలోనే కామారెడ్డిని మొదటి స్థానంలో నిలపాలి

by Sridhar Babu |
రాష్ట్రంలోనే కామారెడ్డిని మొదటి స్థానంలో నిలపాలి
X

దిశ, కామారెడ్డి : రాష్ట్రంలోనే కామారెడ్డి అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య అధికారులు, మెడికల్ కళాశాల సిబ్బంది, డీఎం హెచ్వో అధికారులు, పీహెచ్ సీ సెంటర్ల అధికారులతో సమావేశం నిర్వహించారు.

మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చూపాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని కోరారు. రానున్న వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ కి సంబంధించిన అన్ని శాఖల అధికారులు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంసింగ్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story