కల్లు సీసా పగలగొట్టి కడుపులో పొడిచి...ఆపై గొడ్డలితో దాడి

by Sridhar Babu |
కల్లు సీసా పగలగొట్టి కడుపులో పొడిచి...ఆపై గొడ్డలితో దాడి
X

దిశ, ఎల్లారెడ్డి : తన సొంత అన్న కొడుకు తనని గొడ్డలితో గాయపరిచాడని, కల్లు సీసా పగల గొట్టి కడుపులో పొడిచాడని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఎల్లారెడ్డి మండలం సాతల్లి గ్రామానికి చెందిన ముసగాళ్ల సదానందం తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తిలో నుండి అన్నదమ్ములం సమానంగా పంచుకున్నామని తెలిపారు. తన అన్న దేవయ్య 22 సంవత్సరాల క్రితం మృతి చెందాడని, ఆ భూమిని తాను కొనుగోలు చేశానని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు

ఆ భూమిని తన అవసరం నిమిత్తం అమ్ముకున్నామనుకుంటే దానిలో సగభాగం భూమి వస్తదని తన అన్న కొడుకు ముసగళ్ల ప్రవీణ్ పలుమార్లు గొడవకు దిగినట్టు చెప్పాడు. దాంతో గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా వినకుండా శనివారం కల్లు సీసా ను పగలగొట్టి కడుపులో పొడిచినట్టు తెలిపాడు. అనంతరం పథకం ప్రకారం గొడ్డలితో తలపై, వీపుపై దాడి చేశాడని వివరించారు. బాధితుడిని స్థానికులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.

Advertisement

Next Story