కాంగ్రెస్​ వస్తే హిందువుల ఆస్తులు దోచి ముస్లింలకు పంచి పెడతారు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్​ వస్తే హిందువుల ఆస్తులు దోచి ముస్లింలకు పంచి పెడతారు
X

దిశ, బోధన్ : హిందువులలోని ఎస్సీ, బీసీ, అప్పర్ క్యాస్ట్ అన్ని వర్గాల ఆస్తులను దోచి ముస్లింలకు పెట్టేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ అభ్యర్థి ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్ లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు బోధన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముని మందిర నిర్మాణం సుదీర్ఘ పోరాటాలు, హిందూ సంఘాల కృషి, ఎందరో త్యాగధనుల వలన సాధ్యపడిందని, శ్రీ రామ్ లాల పున:ప్రతిష్ఠ అనంతరం ఈ హనుమాన్ జయంతిని భారతదేశం మొత్తం పండగలా జరుపుకుంటుంది అన్నారు. మోడీ పాలనలో భారతదేశం రామరాజ్య స్థాపన దిశలో మరింత బలంగా తయారవుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హిందూ సమాజం భయపడేలా ఉందని అన్నారు. అందులోని పేజీ నెంబర్ 9, పాయింట్ 3 లో ముస్లింలకు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, వ్యాపారం అన్ని రంగాల్లో పూర్తి అడ్వాంటేజ్ గా ఉంటామని వాగ్దానం చేశారని తెలిపారు.

మౌలానా ఆజాద్ అబ్రాడ్ స్కాలర్షిప్ లను పెంచుతామని ఇలా దేశ సంపదను దోచి ముస్లింలకు తినిపిస్తాం అనే విధంగా మేనిఫెస్టో ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివిన పీఎం మోడీ ఉలిక్కిపడ్డారని తెలిపారు. పేజీ నెంబర్ 9, పాయింట్ 3, 4, 5 ప్రకారం హిందువుల రిజర్వేషన్లు, ఆస్తులు, భూములు, పాట్లు అన్ని దోచి ముస్లింలకు పెడతాం అనే స్వీపింగ్ స్టేట్మెంట్ ఉందన్నారు. ముస్లిం యువతకు ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా లోన్స్ ఇస్తామని చెబుతున్నారని, అంటే బ్యాంకులను దోచుకోమని చెబుతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి హిందూ సమాజం, కళ్లు తెరుచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ భారతదేశంను ఐఎస్ఐ, పీఎఫ్ఐ ల అడ్డాగా మారుస్తుందని అన్నారు. దేశాన్ని మూడు ముక్కలుగా చేసిన ఘనత కాంగ్రెస్ దేనని, పదుల సంఖ్యలో బాంబు బ్లాస్టులు, టెర్రర్ ఎటాక్ లు జరిగి మనశ్శాంతి లేదని అన్నారు. హిందువులు అంటే కాంగ్రెస్ పార్టీకి కక్ష ఎందుకు అని ప్రశ్నించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2008 లో ఈ దేశ సంపద మొదటగా ముస్లింలకు చెందుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఎలక్షన్ లో గెలవడానికి కాంగ్రెస్ ఎలాంటి పనులైనా చేస్తుందని విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి 10 ఏళ్లలో జరిగిందని, రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్ట్స్, ఎయిమ్స్, ఐఐటీ లు ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. అంతరిక్షం నుండి అంత్యోదయం వరకు ఎలాంటి అవినీతి లేకుండా పాలన చేస్తున్న మోదీని చూసి కాంగ్రెస్ కు జీర్ణం అవుతలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీంలు హిందువులకు మాత్రమే అని కాకుండా ప్రతి భారతీయునికి అందేలా ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రైతులకు, మహిళలకు, యువతకు, ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు అటకెకించాడని విమర్శించారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కీం లలో జరిగిన లక్ష కోట్ల అవినీతి బయటకు తీసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ప్రజా సమస్యలను వదిలి టెలిఫోన్ ట్యాపింగ్ లీకేజీ లు ఇస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ కల్వకుంట్ల కవిత ను అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. బోధన్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అఘాయిత్యాలు, అవినీతి , అవకతవకలు చేసి అరెస్ట్ భయంతో విదేశాల్లో దాకున్నాడని విమర్శించారు. వ్యక్తిగతంగా రాజకీయ నాయకుల కుటుంబం, పిల్లలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరంగా భవిస్తానని, రాష్ట్ర సర్కారుకు దమ్ముంటే షకీల్ ను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed