సిద్ధరామేశ్వరుడికి విరాళం..

by Sumithra |
సిద్ధరామేశ్వరుడికి విరాళం..
X

దిశ, భిక్కనూరు : దక్షిణ కాశీ సిద్ధరామేశ్వరాలయానికి రైతుబంధు మండల కన్వీనర్ బోండ్ల రామచంద్రం దంపతులు విరాళం అందజేశారు. సోమవారం తన మనవడు సుహన్ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకొని 11, 516 రూపాయల విరాళం అందజేయగా, భిక్కనూరు మండల కేంద్రంలోని సంతోషిమాత అమ్మవారికి 5,116 రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పద్మ శ్రీధర్, ఉత్సవ కమిటీ కన్వీనర్ తాటిపాముల లింబాద్రి, ఆర్యవైశ్య యువజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గంగెల్లి మధుసూదన్, కోశాధికారి కొడిప్యాక అంజయ్య, బోండ్ల సునీల్ కుమార్, కల్లూరి సిద్ధ రాములు గంగెల్లి జగదీశ్వర్, పార్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed