- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- భక్తి
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయింది
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం నగరంలోని 45 వ డివిజన్ లోని హనుమాన్ మందిరం నుంచి సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి నినాదం తోనే ముందుకు వెళ్తుందన్నారు. నగరం లో కొత్త రేషన్ కార్డులు ఒకటి కూడా మంజూరు చేయకపోవడం మీ దౌర్బాగ్యానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో అవాస్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామన్నారు. కట్టిన ఇండ్లని కూడా ఇప్పటిదాక ఒక్క ఇంటి ని కూడా అందచేయలేదని పేర్కొన్నారు. నగరంలో ఎమ్మెల్యేల తీరు ప్రజలు గమనిస్తున్నారని, ఎలా సాగనంపాలో వాళ్లకు తెలుసన్నారు. ఈ కార్యక్రమం లో 45వ డివిజన్ నాయకులు బొబ్బిలి వేణు, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య లింగం, న్యాలం రాజు, నాగోళ్ళ లక్ష్మి నారాయణ,మెట్టు విజయ్, సుక్క మధు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.