కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జుక్కల్ సొసైటీ చైర్మన్...

by Sumithra |
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న  జుక్కల్ సొసైటీ చైర్మన్...
X

దిశ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ తో పాటు అంగర్గ గ్రామ మాజీ ఎంపీటీసీ నాగనాథ్, బాలాజీ పటేల్, శంకర్, రాజు, తుకారాం, ఎన్. రాజు పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌలాస్ గ్రామ మాజీ సర్పంచ్ గొల్ల హనుమాన్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed