తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

by Kalyani |
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
X

దిశ, మద్నూర్: మండల కేంద్రంలోని సోనార్ స్వామి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం వేసి ఉండగా తాళం పగుల కొట్టి దొంగలు పడ్డారు. ఆ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్చార్జి ఎస్సై సాయన్న దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. దొంగతనంలో 12 తులాల వెండి నాణెములు, ఒక గ్రామం బంగారు విగ్రహం, నగదు రూ.1200 ఎత్తుకెళ్లారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి ఎస్సై సాయన్న తెలిపారు.

Next Story

Most Viewed