పాత కక్షలతో యువకుడి దారుణ హత్య

by Sridhar Babu |
పాత కక్షలతో  యువకుడి దారుణ హత్య
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి -రామేశ్వర్ పల్లి గ్రామాల శివారులో మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆరేపల్లి గ్రామానికి చెందిన బోయ నవీన్ (23) దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో అదే గ్రామానికి చెందిన భువనగిరి మధు, పొందుర్తి ప్రవీణ్ లు కలిసి కత్తులతో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి చంపారు.

ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న నవీన్ మంగళవారం ఉదయం తన తల్లిదండ్రులను పొలం వద్ద వదిలి ఆటోపై కామారెడ్డికి వెళుతున్న సమయంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు బైక్ పై వచ్చి హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు సందర్శించారు. మృతుడు బోయ నవీన్(25) తండ్రి పెద్ద నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story