- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
దిశ, కోటగిరి : బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి, బీసీ బిడ్డ గాలి అనిల్ కుమార్ ను ఆశీర్వదించి ఢిల్లీ పంపితే కేంద్రం మెడలు వంచైనా సరే అభివృద్ధి చేస్తాడని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటగిరి పోతంగల్ మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాల కాంగ్రెస్ ని నమ్మకుండా అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు.
గతంలో ఎంపీలుగా గెలిపించుకున్న సురేష్ షేట్కార్, బీబీ పాటిల్ తమ బిజినెస్ ల కోసమే తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేవని విమర్శించారు. బీసీ బిడ్డ అయిన గాలి అనిల్ కుమార్ ను గెలిపించి ఢిల్లీకి పంపితే పార్లమెంటులో మనగళం విప్పి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, ఏజాజ్ ఖాన్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్స్ సిరాజుద్దీన్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ కూచి సిద్దు, కులకర్ణి అనిల్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ హమీద్, జుబేర్, గంగా ప్రసాద్ గౌడ్, బాబు ఖాన్, జమీర్ పాల్గొన్నారు.