- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రాజకీయాలు ఎన్నికల్లో మాత్రమే.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
దిశ, ఆర్మూర్ : రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని ఎన్నికలు ముగిశాక ప్రజా ప్రతినిధులందరూ ప్రజల కోసం అభివృద్ధి పనులు చేసేందుకు పోటీ పడాలని.. ప్రజా ప్రతినిధుల్లో అభివృద్ధిలో పోటీతత్వం పెరగాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, మున్సిపల్ కమిషనర్ రాజులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర స్థాయి నాయకులను కలిసి అభివృద్ధి కోసం నిధులు అడిగి మంజూరు చేయించుకొస్తానని, మున్సిపల్ చైర్ పర్సన్ తో కలిసి అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు.
అనంతరం పట్టణంలోని మార్కెట్ యార్డును, మినీ స్టేడియం, బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ లతో కలిసి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుని పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు. తర్వాత నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో గుర్తిశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో 10 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, నందిపేట్, పిప్రి, వెల్మల్ లకు చెందిన బీజేపీ నాయకులు, గుర్తిశ్వర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.