పసుపు లారీ హైజాక్ కేసులో నిందితుడి రిమాండ్

by Kalyani |
పసుపు లారీ హైజాక్ కేసులో నిందితుడి రిమాండ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సంచలనం రేపిన పసుపు లారీ హైజాక్ కేసులో నిందితుడ్ని పోలీసులు గుర్తించి రిమాండుకు పంపినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ డి. విజయ్ తెలిపారు. నవీపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన షేక్ తోఫిక్ అలీని పోలీసులు పట్టుకుని అతని నుండి రూ.30 లక్షల విలువ చేసే పసుపు, రూ.40 లక్షల విలువ చేసే లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితుడి నుంచి పసుపు కోనుగోలు చేసిన వారిని, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19న నిజామాబాద్ వైపు నుండి గుంటూరుకు వెళుతున్న పసుపు లారీని ఇందల్వాయి టోల్ ప్లాజా ఆపి, తద్వారా గాంధారి ఎక్స్ రోడ్డు వద్ద హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు గంటల వ్యవధిలోనే లారీని ట్రేస్ చేసి గుర్తించారు. అప్పటి నుండి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం నిందితుడ్ని రిమాండ్ కు తరలించారు.

Next Story