మూడేళ్ల బాలుడు కిడ్నాప్

by Sridhar Babu |
మూడేళ్ల బాలుడు కిడ్నాప్
X

దిశ క్రైమ్, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద బాలుడిని గుర్తించిన వ్యక్తులు బైక్ పై ఎత్తుకొని వెళ్లిపోయారు. బాలుని కుటుంబ సభ్యులు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాచక వృత్తి చేసుకునే కుటుంబానికి చెందిన వారు డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతాల నుంచి నిజామాబాద్ నగరానికి వలస వచ్చి యాచించి జీవిస్తున్నారు. వారి మూడు సంవత్సరాల కొడుకును నగరంలోని కంటేశ్వర్ కల్లుబట్టి వద్ద తల్లిదండ్రులు కల్లు మత్తులో ఉండగా బాలుడివి బైక్ పై ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చిన వారి దృశ్యాలు

సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పట్టుకునే పనిలో ఉన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పిల్లల వరుస కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. గత వారం నిజామాబాద్ నగరంలోని మాలపల్లి లో ఏడు సంవత్సరాల మినాజ్ అనే బాలుడిని పొరుగింటి యువకుడు కిడ్నాప్ చేసి మూడు లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే. భీంగల్ పట్టణంలో ఆర్టీసీ బస్సులో తల్లిదండ్రులతో ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా బాలుడు ఏడవడంతో ఆ వ్యవహారం విఫలం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కమ్మరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

Advertisement

Next Story