మహిళ విషయంతో తనని అనుమానిస్తారని వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
మహిళ విషయంతో తనని అనుమానిస్తారని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, గాంధారి : మహిళ విషయంతో తనని అనుమానిస్తారని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మాతృ సంగెం కు చెందిన నీరడి సాయిలు (46) కామారెడ్డి డిస్ట్రిక్ అగ్రికల్చర్ ఆఫీసులో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గుర్జాల్ గ్రామానికి చెందిన ఇతని మరదలు తో గతంలో గొడవలు కాగా ఇరు కుటుంబాల బంధువులు సముదాయించి ఒకరి జోలికి ఇంకొకరు పోవద్దని

సూచించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 31న ఆమె ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. దాంతో గాంధారి పోలీస్ స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆమె బంధువులు తననే అడుగుతారని భయంతో తీవ్ర మనస్థాపానికి లోనై తన ఇంటి ముందు గల రేకుల షెడ్డు కు శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి భార్య నీరడి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story