మువ్వన్నెల జెండాకు తీరని అవమానం

by Sridhar Babu |
మువ్వన్నెల జెండాకు తీరని అవమానం
X

దిశ, కోటగిరి: ఆగస్టు : ఓపక్క దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం ముస్తాబవుతోంది. తెల్లారితే జెండా వందనం. మువ్వన్నెల జెండాను చేత పట్టుకుని గౌరవించుకునే ఉద్విగ్న క్షణాలు జాతీయ జెండాకు ఎనలేని గౌరవాన్ని ఇస్తూ సగర్వంగా రెపరెపలాడిస్తారు. అలాంటి జెండాలను నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్లక్ష్యంగా కట్టలు కట్టి ఓ మూలన పడేశారు.

జాతీయ జెండాకు అవమానం కలిగిస్తున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోకపోయినా కనీసం పంద్రాగస్టు కైనా పట్టించుకోని పరిస్థితి ఉంది. ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో అందరిలో దేశ భక్తిని నింపుతుంటే అధికారుల్లో ఆ స్పృహ కొరవడిందని కోటగిరి ఎంపీడీఓ ఆఫీసులో మూలన పడేసిన జెండాల కట్టలను చూస్తే తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Advertisement

Next Story

Most Viewed