108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం.. సిబ్బంది అప్రమత్తతో తల్లి, బిడ్డ క్షేమం

by Shiva |
108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం.. సిబ్బంది అప్రమత్తతో తల్లి, బిడ్డ క్షేమం
X

దిశ, తాడ్వాయి: 108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. కన్కాల్ గ్రామానికి చెందిన సుమలత అనే గర్భిణికి బుధవారం పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది ఆమెను కామారెడ్డి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో నొప్పులు తీవ్రం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది గర్భిణికి సురక్షతంగా ప్రసవం చేశారు. సుమలత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రభాకర్, పైలెట్ ప్రశాంత్ తెలిపారు. అనంతరం వారిని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బందికి సుమలత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed