ట్రాక్టర్ ట్రాలీల దొంగల అరెస్ట్

by Kalyani |
ట్రాక్టర్ ట్రాలీల దొంగల అరెస్ట్
X

దిశ, డిండి : ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేసి, అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాధవరం సంపత్ రావు, బొలగం శ్రీను, కడారి బాబు లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజు తెలిపారు. పట్టణ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం...డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన అదుర్ల సందీప్ సెప్టెంబర్ 4వ తేదీన పొలంలో ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని సెప్టెంబర్ 9న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

పట్టణ ఎస్సై దొంగతనం కేసు నమోదు చేసి, అనుమానం ఉన్న కామేపల్లికి చెందిన మాధవరం సంపత్ రావు ను విచారించగా గట్టుతుమ్మెనుకు చెందిన బొలగం శ్రీను, అచ్చంపేటకు చెందిన కడారి బాబు సహాయంతో కామేపల్లిలో 1 ట్రాక్టర్ ట్రాలీని,నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి నుంచి మరొక ట్రాక్టర్ ట్రాలీని మొత్తం 2 ట్రాక్టర్ల ట్రాలీలను దొంగతనం చేసినట్లు తెలిపారు. శనివారం ట్రాక్టర్ ట్రాలీని అచ్చంపేట నుంచి దేవరకొండకు అమ్మకానికి తీసుకువెళ్లే క్రమంలో డిండి సరిహద్దుల్లో పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారిని పట్టుకుని విచారించగా దేవరకొండలో మార్కెట్ యార్డులో నిలువ ఉంచిన మరొక ట్రాక్టర్ ట్రాలీ కూడా ఉందని తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీలను, ఇంజన్లను డిండి పోలీస్ స్టేషన్ కు తరలించి ముగ్గురిపై కేసు నమోదు చేసి,రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హుస్సేన్, రవి, కాశయ్య, శ్రీనివాసులు, సైదమ్మ పాల్గొన్నారు.

Next Story

Most Viewed