Minister Venkata Reddy : గత ప్రభుత్వం అప్పులు,వడ్డీలు రూ.42 వేల కోట్లు చెల్లించాం

by Aamani |
Minister Venkata Reddy : గత ప్రభుత్వం అప్పులు,వడ్డీలు రూ.42 వేల కోట్లు చెల్లించాం
X

దిశ,నల్లగొండ: రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం రాష్ట్ర బడ్జెట్ లోరూ. 72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడమే కాక రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు కేటాయింపు చేశామన్నారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగిందని, ఎస్ఎల్బీసీ సొరంగం ,శివన్న గూడెం, బ్రాహ్మణ వెల్లేముల, పాలమూరు- రంగారెడ్డి ,సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయింపు చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి 29 వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ బి కి 7315 కోట్ల రూపాయల కేటాయింపు,కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని, రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.75,577 కోట్ల మిగులు ఉండేదన్నారు.

డిసెంబర్ 3, 2023 న రూ. 6,71357 కోట్ల రూపాయలతో అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం అప్పగించిందని,రు.37 వేల కోట్లు ఇందిరమ్మ 6 గ్యారంటీలకు అమలు చేయడం, ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇస్తూన్నమన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులు,వడ్డీ కలిపి 42 వేల కోట్లు చెల్లించాము.రైతులకు ఇచ్చే 12 వేల రూపాయలను త్వరలోనే అమలు చేస్తామని,గతంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్నడూ 72,000 కోట్లు రూపాయలు కేటాయించలేదని, దేశ చరిత్రలోనే వ్యవసాయానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏది లేదన్నారు. పది రోజుల్లో బ్రాహ్మణ వెల్లేముల ట్రయల్ రన్ నిర్వహిస్తామని, డిసెంబర్ లో కాలువలను పూర్తి చేస్తామని, ఎస్ ఎల్ బీసీ సొరంగ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అమెరికా నుంచి కొత్త మిషన్ తెప్పించనున్నామని, సాధ్యమైనంత త్వరగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తామన్నారు. నల్గొండ లోని ప్రాజెక్టులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి పనులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని,ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 80 కోట్లలతో 20 ఎకరాలలో సమీకృత వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నమని,స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రెండు నెలల్లో టెండర్లు పిలువనున్నమని,రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించి ఐబీఎం తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొన్నారు.



Next Story