‘మా రోడ్డును బాగు చేయండి.. మహాప్రభో..’

by Rajesh |
‘మా రోడ్డును బాగు చేయండి.. మహాప్రభో..’
X

దిశ, చింతపల్లి : నాలుగు గ్రామాల ప్రజల అవసరం కోసం ఏర్పాటు చేసిన రోడ్డును బాగు చేయండి మహాప్రభో అని నెల్వవలపల్లి గ్రామ యువజన సంఘం నాయకుడు మధు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి తొమ్మిది నెలలు పూర్తయిన ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నసర్లపల్లి, తిరుమలపురం, నెల్, ఉప్పరపల్లి, నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు నడిచే దారిలో పూర్తిగా గుంటలు ఏర్పడడం వల్ల స్కూల్ బస్సులు ఆటోలు కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద టిప్పర్లు తిరగడం వల్ల, రోడ్డు దుమ్ము లేచి అదంతా పంటల మీద కప్పేయడంతో పంటలకు కూడా తీవ్రంగా నష్టం జరుగుతుందని అన్నారు. అందుకే పెద్ద పెద్ద వాహనాలు ఈ రోడ్డుపై తిరగకుండా నియంత్రించాలని, అదే క్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చొరవ తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.



Next Story