మరణిస్తూ అవయవ దానంతో ఐదుగురికి ప్రాణదానం...

by Disha Web Desk 11 |
మరణిస్తూ అవయవ దానంతో ఐదుగురికి ప్రాణదానం...
X

దిశ, వలిగొండ:- తాను మరణిస్తూ తన అవయవాలను దానం చేసి ఐదుగురు వ్యక్తులకు ప్రాణదానం చేసి మానవత్వం చాటుకున్న ఘటన మండలంలోని కంచనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలిగొండ మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన మెర్గు అంజయ్య(45) అనారోగ్యంతో బాధపడుతూ హైదారాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చి కిడ్నీలు, లివర్, కండ్లు, గుండెను దానం చేసి మానవత్వం చాటుకున్నారు. అవయవ దానంతో ఐదుగురి వ్యక్తులకు ప్రాణదాతగా నిలిచాడు.



Next Story

Most Viewed