మొహ్మద్​ ప్రవక్త శాంతి మార్గాన్ని బోధించారు.. ఎమ్మెల్యే..

by Sumithra |
మొహ్మద్​ ప్రవక్త శాంతి మార్గాన్ని బోధించారు.. ఎమ్మెల్యే..
X

దిశ, కూకట్​పల్లి : మొహ్మద్​ ప్రవక్త బోధించిన శాంతి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్​బీ కాలనీ లోని 4వ ఫేజ్​ ఈద్గా వద్ద సోమవారం నిర్వహించిన మిలాదున్​ నబి వేడుకలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మొహ్మద్​ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లింలు మిలాదున్​ నబి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారని, మొహ్మద్​ ప్రవక్త బోధించిన శాంతి మార్గంలో అందరు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండి.గౌసుద్దిన్, మాజీ కార్పొరేటర్​లు తూము శ్రావణ్​ కుమార్​, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed