కంటోన్మెంట్‌లో మొదటి రోజు నామినేషన్ నిల్

by Disha Web Desk 23 |
కంటోన్మెంట్‌లో మొదటి రోజు నామినేషన్ నిల్
X

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బోర్డు కార్యాలయంలో నామినేషన్ ల మొదటి రోజు గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు బోర్డు కార్యాలయానికి 100 మీటర్ల లోపే తమ ర్యాలీని నిలిపివేయాలని సూచించారు. అలాగే నామినేషన్ వేసే కార్యాలయం లోపలికి నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరో నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. నిబంధనలు అభ్యర్థులు పాటించి తమకు సహకరించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed